News
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై పోలీసుల ఉక్కు పాదం
◆ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు 5 మంది అరెస్ట్..
◆ సుమారు 2 లక్షలు నగదు, ఐదు సెల్ ఫోన్లు, 25 లీటర్ల నాటు సారా స్వాధీనం..
కర్నూలు జిల్లా ఆదోనిలో 5 మంది క్రికెట్ బెట్టి నిర్వాహకులను వన్ టౌన్ సిఐ విక్రమసింహ అరెస్టు చేశారు. సిఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు డిఎస్పి శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ నగర్ కు చెందిన గొల్ల వీరేష్ (36), బోయగిరికి చెందిన బోయ ఆంజనేయులు (37), రాజరాజేశ్వరి గుడి సమీపంలో ఉన్న పింజరి మహమ్మద్ ఖాసిం (37), గొల్ల వీధికి చెందిన గొల్ల విజయ్ కారం పేటకు చెందిన మిఠాయి వాలా ఉస్మాన్ ఐదు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1లక్ష 98 వేల నగదు, 5 సెల్ ఫోన్లు మరియు 25 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 5 మంది పై ఏపీ గేమింగ్ యాక్ట్ 9(1), యాప్ యాక్ట్ 8(E) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో వన్ టౌన్ సిఐ విక్రమసింహ మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సత్తార్ వలి పోలీస్ కానిస్టేబుళ్లు రామచంద్ర, రంగస్వామి, సుధీర్ కుమార్, అశోక్ కుమార్, సుధాకర్, అల్లెన్న పాల్గొన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




