News
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై పోలీసుల ఉక్కు పాదం
◆ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు 5 మంది అరెస్ట్..
◆ సుమారు 2 లక్షలు నగదు, ఐదు సెల్ ఫోన్లు, 25 లీటర్ల నాటు సారా స్వాధీనం..
కర్నూలు జిల్లా ఆదోనిలో 5 మంది క్రికెట్ బెట్టి నిర్వాహకులను వన్ టౌన్ సిఐ విక్రమసింహ అరెస్టు చేశారు. సిఐ విక్రమ సింహ తెలిపిన వివరాల మేరకు ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు డిఎస్పి శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ నగర్ కు చెందిన గొల్ల వీరేష్ (36), బోయగిరికి చెందిన బోయ ఆంజనేయులు (37), రాజరాజేశ్వరి గుడి సమీపంలో ఉన్న పింజరి మహమ్మద్ ఖాసిం (37), గొల్ల వీధికి చెందిన గొల్ల విజయ్ కారం పేటకు చెందిన మిఠాయి వాలా ఉస్మాన్ ఐదు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1లక్ష 98 వేల నగదు, 5 సెల్ ఫోన్లు మరియు 25 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 5 మంది పై ఏపీ గేమింగ్ యాక్ట్ 9(1), యాప్ యాక్ట్ 8(E) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో వన్ టౌన్ సిఐ విక్రమసింహ మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సత్తార్ వలి పోలీస్ కానిస్టేబుళ్లు రామచంద్ర, రంగస్వామి, సుధీర్ కుమార్, అశోక్ కుమార్, సుధాకర్, అల్లెన్న పాల్గొన్నారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
