కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో గల కళ్యాణ్ ఫ్యాక్టరీలో పేకాట అడుతున్నారన్న 8 మంది అరెస్ట్ చేసి వారి వద్దనుండి 52 పేక ముక్కలను మరియు రూ 34,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు 1 టౌన్ సి ఐ విక్రమ సింహ. సీఐ తెలిపిన వివరాల మేరకు కౌడల్ పేట కి చెందిన చిలక రాఘవేంద్ర , సంత పేట కళ్యాణ్ కుమార్ , బైచిగేరి కి చెందిన తెలుగు నరసప్ప, రంగారెడ్డి, హవన్నపేట కి చెందిన రంజాన్ రహంతుల్లా , బాసాపురం కి చెందిన గంగన్న , ఖజిపురా కి చెందిన రఫిక్, హనుమాన్ నగర్ కి చెందిన రవి అందర్ బాహర్ ఆడుతుండగా సిబ్బంది సహాయం తో పట్టుకొని, వారిపై కేసు నమోదు చేశామని సి ఐ విక్రమ సింహ తెలిపారు. ఈ దాడుల్లో సి ఐ సిబ్బంది లక్ష్మణ్, భీంలా నాయక్, రంగస్వామి , రామచంద్ర, దయాకర్, ముస్తక్ , మహబూబ్ బాషా పాల్గొన్నారు.