Connect with us

News

ఘోర రైలు ప్రమాదం 50 మంది మృతి 350 మందికి గాయాలు

Published

on

ఓడిశాలో ఘోర రైలు ప్రమాదం కోరమండల్ ఎక్స్ప్రెస్ బాలసుర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ ను ఢీకొట్టడంతో ఏడు బోగీలు బోల్తా పడడంతో 50 మంది కి పైగా మృతి 350 మందికి పైగా గాయాలు కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలు బోల్తా పడి పక్కనే వెళుతున్న హౌరా ఎక్స్ప్రెస్ ట్రైన్ పడి ఉన్న బోగీలను ఢీకొట్టగా అందులో కూడా చాలామందికి గాయాలయ్యాయి. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. సహాయ చర్యలు చేపట్టిన అధికారులు 60 అంబులెన్స్లలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ ని కూడా రంగంలోకి దింపిన కేంద్ర ప్రభుత్వం ఎయిర్ లిఫ్ట్ సహాయంతో సహాయ చర్యలు చేపట్టారు.
కోరమండల్ ఎక్స్ప్రెస్ వేగం 120కిలోమీటర్ల ఇందులో మొత్తం 24 బోగీలు 12 స్లీపర్లు కోచులు 6 ఏసి కొచులు 3 జండ్రల్ బోగీలు మరికొన్ని ఇతర బోగీలు ఉన్నాయి. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ట్విట్టర్ లో స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ట్విట్టర్లో స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
ట్విట్టర్లో స్పందించిన ఒడిశా సీఎం
బోల్తా పడిన కోరమండల్ ఎక్స్ప్రెస్
క్షతగాత్రులను బయటకు తీస్తున్న సహాయక బృందం

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending