News
ఘోర రైలు ప్రమాదం 50 మంది మృతి 350 మందికి గాయాలు
ఓడిశాలో ఘోర రైలు ప్రమాదం కోరమండల్ ఎక్స్ప్రెస్ బాలసుర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ ను ఢీకొట్టడంతో ఏడు బోగీలు బోల్తా పడడంతో 50 మంది కి పైగా మృతి 350 మందికి పైగా గాయాలు కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలు బోల్తా పడి పక్కనే వెళుతున్న హౌరా ఎక్స్ప్రెస్ ట్రైన్ పడి ఉన్న బోగీలను ఢీకొట్టగా అందులో కూడా చాలామందికి గాయాలయ్యాయి. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. సహాయ చర్యలు చేపట్టిన అధికారులు 60 అంబులెన్స్లలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ ని కూడా రంగంలోకి దింపిన కేంద్ర ప్రభుత్వం ఎయిర్ లిఫ్ట్ సహాయంతో సహాయ చర్యలు చేపట్టారు.
కోరమండల్ ఎక్స్ప్రెస్ వేగం 120కిలోమీటర్ల ఇందులో మొత్తం 24 బోగీలు 12 స్లీపర్లు కోచులు 6 ఏసి కొచులు 3 జండ్రల్ బోగీలు మరికొన్ని ఇతర బోగీలు ఉన్నాయి. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.





News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
