News
మౌలిక సదుపాయాలు కల్పించాలి. CPM పార్టీ
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో త్రాగునీరు, రోడ్లు, స్మశాన వాటిక సమస్యలు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం ముందు CPM పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సభ్యులు ఉచ్చిరప్ప అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో జనార్ధన్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే. లింగన్న, కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి మాట్లాడుతూ
ఆదోని మండలంలో త్రాగునీరు సమస్య పరిష్కారానికి
1. నెమలికల్ ఎస్ ఎస్ ట్యాంక్ నుండి బసరకోడు వరకు అదనపు పైప్ లైన్, కుప్పగల్లు ఎస్ ఎస్ ట్యాంక్ నుండి పాండవగల్లు వరకు అదనపు పైప్ లైన్ వేయాలి..
2. హనుమాన్ స్కీం దగ్గర మరియు కుప్పగల్ స్కీం దగ్గర దగ్గర ఫిల్టర్ బెడ్లు ఏర్పాట్లు చేయాలి..
3. పెద్ద తుంబలం ఎస్ఎస్ ట్యాంక్ వెడల్పు చేయాలి..
4. చిన్న హరివాణం ఎస్ఎస్ ట్యాంక్ నుండి సంతే కుల్లూరు మరియు పెద్ద హరివాణం వరకు పైప్ లైన్ వేయాలి..
5. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్ల సమస్యలు పరిష్కరించాలి..
6. గనేకల్ కుప్పగల్లు, నారాయణపురం గ్రామాలలో స్మశాన వాటిక సమస్యలు పరిష్కరించాలి..
7. అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలి..
8. గణేకల్లు, బల్లెకల్ గ్రామాలలో జడ్పీ స్కూళ్ళ లో టీచర్ల కొరత తీర్చాలి..
9. బల్లె కల్లు, పెద్ద తుంబలం గ్రామాల్లో జడ్పీ స్కూళ్ళకు రోడ్లు వేయాలి..
10. పాండవగల్ మండల పరిషత్ స్కూల్ కి సిసి రోడ్డు, డ్రైనేజీ వేయాలి..
11. పాండవగల్లు, గోనబావి గ్రామాల్లో ఆక్రమణకు గురైన చెరువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి..
12. ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా అన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు వీధిలైట్లు వేయాలి..
తెలిపిన 12 డిమాండ్లను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు భాష, పాండురంగ, తిక్కప్ప శాఖ కార్యదర్శులు అనిఫ్ భాష, రామాంజనేయులు, తాయన్న, తిక్కన్న, గ్రామాల పార్టీ సభ్యులు మరియు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

News
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News
ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్, బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.


