Connect with us

News

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు

Published

on

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్  బి. నవ్య పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో  శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు మరియు మున్సిపల్ కమిషనర్స్ సంబంధిత  అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య మరియు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇంటి పట్టా కొరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని దరఖాస్తులు అర్హులు ఉన్నారు అని ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు మరియు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని అర్హులైన వ్యక్తులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, స్థలాలను వెంటనే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ప్రభుత్వ సంకల్పం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.  సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటివరకు 1474 జాయింట్ ఎల్పిఎంలు గుర్తించగా, కేవలం 309 దరఖాస్తులు మాత్రమే అందాయని తెలిపారు. మిగిలిన దరఖాస్తులు జూన్ 30వ తేదీ లోపు పూర్తిచేయాలని తహశీల్దార్లకు ఆదేశించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య మరియు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం

65 సంవత్సరాలు పైబడినవారికి మరియు దివ్యాంగులకు రేషన్ సరుకులను జూన్ 25 నుండి 30వ తేదీ లోపు డోర్ డెలివరీ చేయాలని పేర్కొన్నారు. డోర్ డెలివరీ ప్రక్రియలో ఎంతమందికి సరుకులు అందించామో, ఎంతమందికి అందించలేకపోయామో వివరాలు సమగ్రంగా ఇవ్వాలని అధికారులకు తెలిపారు. జూలై నెల రేషన్ సరుకుల పంపిణీ వంద శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు.
కౌలు రైతు కార్డులపై కూడా సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం ఆదోని డివిజన్లో 10,500 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం కేవలం 1,100 కార్డులే నమోదు అయ్యాయని తెలిపారు. జూలై 15వ తేదీ లోపు రీన్యూవల్ మరియు కొత్త దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారి బాలవర్ధరాజును ఆదేశించారు.
     ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డివిజన్లోని తాసిల్దారులు, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, గంగిరెడ్డి, ఆదోని వ్యవసాయ శాఖ అధికారి బాలవర్ధరాజు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ వేణు సూర్య, శ్రీనివాసరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య అధికారులతో సమీక్ష సమావేశం
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending