News
అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలి. జెసి నారపురెడ్డి మౌర్య
కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లోని సిల్వర్ జూబ్లీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “జగనన్నకు చెబుదాం-స్పందన” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు సంబంధిత అధికారులు ఎలా అంటే అలా ఎండార్స్మెంట్ లు ఇవ్వకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలని అపుడే రీ ఓపెన్ కేసుల శాతం తగ్గే అవకాశముందని అన్నారు .
ముఖ్యంగా ఆర్జీలలో రెవెన్యూ కి సంబంధించి మిగులు భూమి, అడ్డంగల్ కరెక్షన్స్ లాంటి పరిష్కారమయ్యే చిన్న చిన్న సమస్యలకు కూడా అర్జీదారులు కర్నూలు జిల్లాకు వచ్చి మరి అర్జీలు ఇస్తున్నారని ఇక్కడ మీ పరిధిలో పరిష్కారం అయ్యే వాటికి ఇక్కడే పరిష్కారం చేయాలని, పరిష్కారం చేయలేని వాటికి ఎందుకు చేయలేకపోతున్నాము అనేది కూడా స్పష్టంగా ఎండార్స్మెంట్ లో వివరించాలన్నారు. లబ్ధిదారులకు కేటాయించిన టిడ్కో ఇళ్ళలో 3 నెలలు నుండి కరెంట్ బిల్లులు కట్టలేదని వారి ఇళ్ళ వద్దకు వెళ్లి కరెంట్ కనెక్షన్ కట్ చేస్తున్నారని మీడియా ప్రతినిధులు స్పందనలో జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా అటువంటి సమస్యల పై తగిన చర్యలు తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని తెలిపారు..తొలుత స్పందన కార్యక్రమం కంటే ముందు అర్జీలు నమోదు చేసే కేంద్రాన్ని పరిశీలిస్తూ అర్జిదారుడు ఇచ్చిన అర్జీ కి సంబంధిత విభాగం కింద తప్పులు లేకుండా నమోదు చేయాలని ఎన్రోల్మెంట్ ఆపరేటర్లకు జాయింట్ కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి, ఆదోని తహసిల్దార్ వెంకట లక్ష్మీ, ఆదోని మునిసిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంపిడిఒ గీత వాణి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News
ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్, బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.


