News
ట్రాఫిక్ సమస్య పై సమావేశం నిర్వహించిన అధికారులు
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ట్రాఫిక్ సమస్యపై పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, డిఎస్పి మేడం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆదోనిలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ మరియు పట్టణం నందు సీసీ కెమెరాలు, స్పీడ్ బ్రేకర్లు ముఖ్యమైన సర్కిల్స్లో పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయటం అదే విధంగా రోడ్డుకు అడ్డంగా ఇరువైపులా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడం గురించి చర్చించరు. ఈ సమావేశంలో మున్సిపాల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎసిపి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సిఐ పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




