News
ఉపాధి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
ఉపాధి లేక గ్రామాలు ఖాళీ అవుతుంటే ఇక్కడే పని చేసుకుంటున్నా ఉపాధి కూలీల జీతాలు చెల్లించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో మంగళవారం దొడ్డనకేరి, మంత్రికి, పెసల బండ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత ఐదు వారాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే గ్రామాలు ఖాళీ అవుతుంటే, ఇక్కడే పనులు కల్పిస్తామని చెబుతున్న అధికారులు వేతనాలు చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని, చట్టంలో చెప్పినట్లుగా పని చేసిన 14 రోజుల లోపల వేతనాలు ఇవ్వాల్సి ఉన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఉపాది హామీ వేతనాలు ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కూలీలతో కలిసి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.


News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
