News
దేవాలయాలలో చోరీకి పాల్పడుతున్న దొంగ అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ గ్రామాలు నారాయణపురం, నాగనాతనహళ్లి, మాదిరే గ్రామాల దేవాలయాలలో చోరీకి పాల్పడుతున్న దొంగ బారికి రామన్న ను అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 1,30,000 విలువ చేసె 9 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి కిరీటంను ఇస్వి పోలీసులు స్వాధీనం చేసుకొని దొంగను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించరు. ఎస్ఐ నాగేంద్ర తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..
ఆదోని మండలం సంతే కుల్లూరు గ్రామంలో శ్రీ అరుడ సిద్దలింగేశ్వర స్వామి మఠములో ఉన్న శ్రీ భీమక్క మాధమ్మ అవ్వల దేవత ల విగ్రహాలపై ఉన్న బంగారు తాళిబొట్లు మరియు బంగారు గుండ్లను, నారాయణపురం గ్రామం శ్రీ రామమ్మదేవాలయములో, నాగనాతనహళ్లి గ్రామం శ్రీ మారెమ్మ దేవాలయంలో, మధిర గ్రామంలో శ్రీ లింగమ్మ అవ్వ దేవతల విగ్రహాల తాళిబొట్లను దొంగిలించిన వ్యక్తి ని మంగళవారం ఉదయం ఆదోని పట్టణం సిరుగుప్ప సర్కిల్ సమీపంలో అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 9 గ్రాముల బంగారు తాళిబొట్లను, 500 గ్రాములు వెండి కిరీటము స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగేంద్ర మీడియా కు తెలిపారు. వీటి విలువ సుమారు 1,30,000/- రూ. ఉంటుందని తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి హోలగుంద మండలం మడ్డి లింగదహళ్లి గ్రామానికి చెందిన బారికి రామన్న గా గుర్తించామని తెలిపారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




