కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండేకల్ గ్రామం పొలంలోని బోర్ లో పైపులు దింపుతుండగా సంభవించిన పేలుడు తో చంద్ర, పుష్పవతి, జైరామ్ ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే చుట్టుపక్కల పొలాల వారు వారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.