ఎమ్మిగనూరులో జాబ్ మేళా.. జిల్లా ఉపాధి అధికారి
కర్నూలు జిల్లా నైపుణ్య మరియు శిక్షణ శాఖా వారి అద్వర్యంలో 12.11.2024 మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, వైఎస్ఆర్ సర్కిల్, ఎమ్మిగనూరు లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి పి.దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్ధులు మీ విద్యార్హతకు సంబందించిన ధ్రువ పత్రాలు, ఫొటోస్, తీసుకుని రావాలని తెలిపారు. మహిళా మరియు పురుష అభ్యర్థులు ఉద్యోగ మేళా లో పాల్గొని మీ అర్హతకు తగిన ప్రైవేటు ఉద్యోగం పొందవచ్చుని జిల్లా ఉపాధి అధికారిణి పి.దీప్తి తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు మీ యొక్క వివరములను www.ncs.gov.in నందు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.