News
పేద ప్రజలను ఇబ్బంది పెడితే హాస్పిటల్ పై చర్యలు తప్పవు
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగెరి గ్రామానికి చెందిన బుడిజగ్గుల మునిస్వామి అనే వ్యక్తికి వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ₹ 1లక్ష 6 వేల 9 వందల రూపాయల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఇప్పటివరకు నాలుగు చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 5 లక్షలు రూపాయల వరకు అందించామని తెలిపారు. ఆరోగ్యశ్రీకి మించి ఖర్చు వచ్చిన ఆరోగ్యశ్రీ లేదు అన్న వారు తాము హాస్పిటల్లో ఖర్చుపెట్టిన సరైన డాక్యుమెంట్స్ ఇస్తే సీఎం క్యాంప్ కార్యాలయం కి ఎమ్మెల్యే ద్వారా పంపిస్తే వారం పది రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు వస్తాయని తెలిపారు. ఆదోనిలో కొన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఉన్న ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ మళ్ళీ ఆరోగ్యశ్రీలో పెట్టి అక్కడ కూడా డబ్బులు తింటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. పేద ప్రజల వద్ద ఆరోగ్యశ్రీ లేదని మాయమాటలు చెప్పి ఎవరైనా డబ్బులు వసూళ్లకు పాల్పడి పేద ప్రజలకు ఇబ్బంది పెడితే అటువంటి వారిపై విచారించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




