News
నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయండి.. ఆదోని తహశీల్దార్
నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధం చేయాలని కర్నూలు జిల్లా ఆదోని తహశీల్దారు శివ రాముడు పేర్కొన్నారు. శనివారం ఆదోని తహశీల్దారు వారి కార్యాలయంలో ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులతో కలిసి నీటి సంఘాల ఎన్నికలకు ఓటరు జాబితా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ. మండలం పరిధిలో పెద్ద హరివాణం, సంతకుడ్లూరు, యడవలి , బలాదూర్, చిన్నగొనేహళ్, మాదిరే, బసపురం, ఇస్వీ, దనాపురం, నగనాతహల్లి, గ్రామాలకు సంబంధించి నీటి సంఘాల ఎన్నికల ఓటరు జాబితాను సిద్ధం చేసి ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో 6వ తేదీ నుంచి 10వ తేది వరకు ప్రచురించలని. ఏదైనా సందేహాలు ఉంటే 11వ తేది నుండి 12వ తేది వరకు దరఖాస్తులను స్వీకరించలని తెలిపారు. పటిష్టమైన ఓటరు జాబితాను తయారు చేయాలని సంబంధిత అధికారులకు తహశీల్దారు శివ రాముడు ఆదేశించారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




