Connect with us

News

రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించిన ఫాక్స్ కాన్

Published

on

పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్
◆ జాబ్ డెస్టినేషన్ గా ఏపీ
◆ 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
◆ ప్లాంట్ కాదు.. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్  సిటీ ఏర్పాటు చేయండి
◆ ఫాక్స్ కాన్ ప్రతినిధులకు ఎదురెళ్లి స్వాగతం పలికిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్
◆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన ఫాక్స్ కాన్

పూలబొకే అందించి స్వాగతం పలుకుతున్నారా లోకేష్

అమరావతి: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన లోకేష్, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం ఫాక్స్ కాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసానికి చేరుకున్న ఫాక్స్ కాన్ బృందానికి ఎదురెళ్లి లోకేష్ స్వాగతం పలికారు. కంపెనీ ప్రతినిధులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివరించారు. 2014 నుండి 2019 వరకూ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి తీసుకున్న చర్యలు, తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్, ఈవీ పాలసీల గురించి వివరించారు. కియా కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చిన విధానాన్ని ఒక కేస్ స్టడీ గా వివరించారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాయితీలు కల్పించే విధానం కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నామని తెలిపారు.

బహుమానం అందించి స్వాగతం పలుకుతున్నారా లోకేష్

ఫాక్స్ కాన్  మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయండి..
సీఎం చంద్రబాబు చొరవతో 2014 నుండి 2019 వరకూ అనేక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. అందులో ఫాక్స్ కాన్ కూడా ఒకటి. 14 వేల మంది మహిళలకు నాడు మీరు ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు ఫాక్స్ కాన్  ఇండియా తన కార్యకలాపాలను విస్తరించాలని చూస్తోంది. అందులో భాగంగా కేవలం ఒక ప్లాంట్ పెట్టాలని నేను మిమ్మల్ని కోరడం లేదు. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధులను లోకేష్ కోరారు. ఫాక్స్ కాన్  మెగా సిటీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం తాము అందిస్తామని లోకేష్ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు. ఆ లక్ష్య సాధనలో ప్రధాన భూమిక పోషించాలని లోకేష్ ఫాక్స్ కాన్ ప్రతినిధులను కోరారు. అనుమతుల నుండి ఉత్పత్తి వరకూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా నేనే స్వయంగా రంగంలోకి దిగుతానని వారికి లోకేష్ భరోసా కల్పించారు. ఫాక్స్ కాన్ మెగా సిటీ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్నారు.

బహుమానం అందించి స్వాగతం పలుకుతున్నారా లోకేష్

ఏపీలో ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల తయారీ..
ఫాక్స్ కాన్ కంపెనీ ఇండియన్ రిప్రజెంటేటివ్ వి.లీ మాట్లాడుతూ.. పెట్టుబడులు ఆకర్షణలో సీఎం చంద్రబాబు చూపించే చొరవను కొనియాడారు. ఏపీతో తమకు మంచి అనుబంధం ఉందని. కానీ గత ఐదేళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకు అనేక ప్లాంట్లు ఉన్నాయని, ఇండియాలో భారీ ఎత్తున కార్యకలాపాలు విస్తరించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. త్వరలోనే తమ బృందం ఏపీ అధికారులతో చర్చించి. ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపోనెంట్స్ తయారీకి సంబంధించిన ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని అన్నారు. మీ 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మా వంతు సహకారం అందిస్తామని లీ అన్నారు.

ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధులను లోకేష్

త్వరలోనే ఏపీలో కార్యకలాపాల విస్తరణ..
సోమవారం జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్ కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే తమ బృందం పర్యటించి పూర్తిస్థాయి ప్రణాళికతో మీ ముందుకు వస్తుందని కంపెనీ ప్రతినిధులు లోకేష్ కు వివరించారు. ప్రభుత్వం తరపున మీకు పూర్తి సహకారంతో పాటు వీలైనంత త్వరగా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని లోకేష్ కంపెనీ ప్రతినిధులతో అన్నారు.
ఈ సమావేశంలో ఫాక్స్ కాన్ ఇండియన్ రిప్రజెంటేటివ్ వి.లీ, డైరెక్టర్ టూ ఫాక్స్ కాన్ ఛైర్మన్ ఆఫీస్ సెంథిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ భరత్ దండి, మేనేజర్ హానా వాంగ్, మేనజర్ వెక్టర్ చెన్, అసిస్టెంట్ మేనేజర్ గ్యారీ, ఐటి, ఎలక్ట్రానిక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరబ్ గౌర్ పాల్గొన్నారు.

ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధులను లోకేష్
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

ఆదోని 09-01-2026:

కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు

09 01 26 రైతు బజార్ ధరల పట్టిక
అడ్వర్టైజ్మెంట్
Continue Reading

News

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక

Published

on

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.

Continue Reading

News

కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.

కాలుతున్న పత్తి
మంటలు ఆర్పుతున్న స్థానికులు
మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
జెసిబి తో పత్తిని పక్కకు చూస్తున్న ఫోటో
Continue Reading

Trending