News
పెద్ద హారివానంలో దారుణహత్య
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హారివానంలో దారుణహత్యకు గురైన ఉప్పారి శేకన్న 41 సం. డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాలు మేరకు మృతుడు శేకన్నకు ఇద్దరు భార్యలు మొదటి భార్య జయమ్మకు పిల్లలు కాక పోతే రెండవ భార్య గంగమ్మను కర్ణాటక శిరుగుప్ప లో పెళ్లి చేసుకున్నాడని గంగమ్మకు ఇద్దరు పిల్లలు ఉన్నారని గంగమ్మ పై అనుమానం పెంచుకొని గొడవ పడేవాడని భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కర్నాటక పోలిస్ స్టేషన్ లో శేకన్న పై కేసు నమోదు అయ్యిందని పెద్దలు సమక్షంలో ఒప్పందం రాసుకొని కాపురం చేస్తున్నారని పేద కుటుంభం కావడంతో జీవనం కోసం గత కొంత కాలంగా ఇద్దరు భార్యలు పిల్లల తో బెంగుళూరుకు వలస వెళ్ళారని పది రోజుల క్రితమే ఊరికి వచ్చారని నిన్న భోజనం చేసి పడుకున్న శేకన్న అర్ధ రాత్రి భార్య జయమ్మ లేచి చూసే సరికి రక్తపు మడుగులో పడి దారుణ హత్యకు గురైయ్యడని ఫిర్యాదు రావడంతో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో వచ్చి పరిశిలించామని . మృతుడు శేకన్నకు శత్రువులు ఎవ్వరూ లేరని ఆస్తి గొడవలు లేవని ఏ రాజకీయ ప్రమేయం లేదని తెలిపారు. హత్య గల కారణాలు త్వరలో విచారణ జరుపుతామని తెలిపారు. సీఐ నల్లన్న , ఎస్సై నాగేంద్రాలు , సిబ్బంది పాల్గొన్నారు.

దారుణహత్యకు గురైన ఉప్పారి శేకన్న 41 సం

దారుణహత్యకు గురైన ఉప్పారి శేకన్న 41 సం
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
