News
పెద్ద హరివాణం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ చేతివాటం

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద హరివాణం గ్రామ రైతులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అర్హులైన 650 మంది రైతులకు ఖరీఫ్ పంట నష్ట పరిహారం అందలేదని ఆందోళన చేశారు. వెంటనే రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ కి వినతి పత్రం అందజేశారు.
అగ్రికల్చరల్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపిన వివరాల మేర కు అకౌంట్ నెంబర్లు కొట్టే సమయంలో ఒక నెంబర్ అటు ఇటు కావడంతో మిస్ అయ్యాయని అన్ని సరిచేసి పంపించమని ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందుతుందని తెలిపారు. అయితే పెద్ద హరివరం విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ 22 అకౌంట్లలో చేతివాటం ప్రదర్శించినట్లు తేలిందని అందులో 8 అకౌంట్లు రికవర్ చేశామని మిగిలిన 7 అకౌంట్లు త్వరలో రికవర్ చేస్తామన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




