News
వేరుశనగ, కొర్ర, పత్తి పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపిన వ్యవసాయ అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామంలో వేరుశనగ, కొర్ర, పత్తి పంటలలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి కర్నూలు ఎ డి ఎ, డిఆర్సి డాక్టర్ కే. వెంకటేశ్వర్లు, ఆదోని ఎ డి ఎ డాక్టర్ అరుణకుమారి మరియు మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి
రైతులకు వివరించారు.

అనంతరం పంట పొలాలను సందర్శించి వేరుశనగ పంట 30 నుండి 45 రోజుల కాలవ్యవధి కలిగి పొగాకు లద్దె పురుగు ఉన్నట్లుగా అధికారులు గమనించి తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు తెలిపారు. ఎకరానికి రెండు కిలోల బెల్లం 5 కిలోల తవుడు మరియు క్లోరోపైరీఫాస్ కలుపుకొని సాయంత్రం వేళల్లో ఉంటలుగా చేసి పొలమందు వెదజల్లడం వల్ల ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది అని తెలిపారు. అయితే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బెట్టకు వచ్చిన పంటలకు 2% యూరియా ద్రావణాన్ని పిచికారి చేయవలసిందిగా రైతులకు సూచించారు.

కొర్ర పంటలో కాండం తొలుచు పురుగు ఉన్నట్లు అధికారులు గమనించి దీనికి( కెల్డాన్) కార్ టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును ఎకరానికి పావు కిలో పిచికారి చేయాలని రైతులకు తెలిపారు.

పత్తి పంటలో దోమ ఉధృతిని తగ్గించడానికి పసుపు రంగు నూనె పూసిన అట్టలను ఎకరానికి 10 చొప్పున మొక్క కంటే కొద్దిగా ఎత్తులో ఉంచడం వల్ల తెల్ల మరియు పచ్చ దోమ యొక్క ఉధృతిని తగ్గించవచ్చని రైతులకు తెలిపారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business4 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు