News
ఆదోని ఫర్టిలైజర్స్ షాపులలో 32 లక్షల అక్రమ నిల్వలను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు
ఆదోని ఫర్టిలైజర్ షాపులపై వ్యవసాయ మరియు విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు..
శ్రీ భీమేశ్వర ఫర్టిలైజర్స్, భువనేశ్వరి సీడ్స్, గీత హైబ్రిడ్ సీడ్స్ దుకాణాలలో సుమారు 32 లక్షల విలువగల రసాయనకి ఎరువులు, బిటి పత్తి విత్తనాలు, కూరగాయల విత్తనాలు అమ్మకాలను నిలిపివేసిన అధికారులు..

వ్యవసాయ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆదోనిలో ని విత్తనా మరియు ఎరువుల దుకాణాలపై వ్యవసాయ మరియు విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక దాడులు నిర్వహించిరు. ఈ దాడులలో
భీమేశ్వర ఫర్టిలైజర్స్ స్టాట్ బుక్ కు మరియు ఈపాస్ మిషన్ నందు పొందుపరిచిన నిల్వల లో తేడాలు ఉండడం వల్ల 5 లక్షల 88 వేల 520 రూపాయల విలువగల రసాయనిక ఎరువులను మరియు భువనేశ్వరి సీడ్స్ నందు 22 లక్షల 61 వేల 941 రూపాయల విలువగల రసాయనిక ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు.

అంతేకాక భువనేశ్వరి సీడ్స్ సెంటర్ నందు 2 లక్షల 46 వేల 240 రూపాయల విలువగల బిటి పత్తి విత్తనాలను మరియు గీత హైబ్రిడ్ సీడ్స్ లో ఒక లక్ష 7 వేల 700 రూపాయల కూరగాయ విత్తనాల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

అనంతరం నవత ట్రాన్స్పోర్ట్ మరియు SRMT ట్రాన్స్పోర్ట్ లలో కూడా తనిఖీలు నిర్వహించారు.
ఈ దాడుల్లో వి. హనుమంతరావు సహాయ వ్యవసాయ సంచాలకులు, క్రోసూరు మరియు పి చంద్రశేఖర్ రెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి, సహాయ సంచాలకులు అరుణకుమారి పాల్గొన్నారు.

News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
