Day: January 28, 2025

ఉపాధి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

ఉపాధి లేక గ్రామాలు ఖాళీ అవుతుంటే ఇక్కడే పని చేసుకుంటున్నా ఉపాధి కూలీల జీతాలు చెల్లించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.కర్నూలు జిల్లా ఆదోని మండలంలో మంగళవారం దొడ్డనకేరి, మంత్రికి, పెసల బండ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత ఐదు వారాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి […]

ట్రాఫిక్ సమస్య పై సమావేశం నిర్వహించిన అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ట్రాఫిక్ సమస్యపై పోలీస్ మరియు మున్సిపల్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, డిఎస్పి మేడం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆదోనిలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ మరియు పట్టణం నందు సీసీ కెమెరాలు, స్పీడ్ బ్రేకర్లు  ముఖ్యమైన సర్కిల్స్లో పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయటం అదే విధంగా  రోడ్డుకు అడ్డంగా ఇరువైపులా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడం గురించి చర్చించరు. ఈ సమావేశంలో […]

ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారుల దాడులు

అక్రమంగా కర్ణాటక మద్యం నిలువ ఉంచిన స్థావరాలపై ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు నిర్వహించారు.కర్నూలు జిల్లా కౌతాళం మండలం హల్వి గ్రామంలో అక్రమంగా కర్ణాటక మద్యం నిలువ ఉంచి అమ్మకాలు  నిర్వహిస్తున్న స్థావరంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించరు. ఈ దాడుల్లో ఇద్దరినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 672 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సైదుల్ మీడియాతో మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు కురువ […]

అన్న క్యాంటీన్ ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ మంగళవారం ఉదయం నుండి వివిధ ప్రాంతాల్లో బాలికల కళాశాల రైతుబజార్ సంతోష్ నగర్ ఎల్ బి స్ట్రీట్, షేర్ ఖాన్ కొట్టాలు తిక్క స్వామి దర్గా రోడ్డు లలో జరుగుతున్న శానిటేషన్ వర్క్ ని పరిశీలించారు. అనంతరం అన్న క్యాంటీన్లో పేద ప్రజలకు పెడుతున్న భోజనాలను అక్కడ నిర్వహిస్తున్న శానిటేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీ న్ లో ఎటువంటి అసౌకర్యం లేకుండా […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో తగ్గుతున్న పత్తి ధర

తేదీ 28-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర..  పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7389/- రూపాయలు కనిష్ట ధర ₹. 4789/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5890/- రూపాయలు కనిష్ట ధర ₹. 3069/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5730/- రూపాయలు కనిష్ట ధర ₹.3900/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5512/- రూపాయలు […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 28 01 25:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 82000-001 గ్రాములు సుమారు రూ. 8200-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 75840-001 గ్రాములు సుమారు రూ. 7584-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 925-00

గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు దగ్ధం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గోకర్ జెండా వీధి ఉర్దూ స్కూల్ వెనకాల గ్యాస్ సిలిండర్ పేలి రెండు పూరి గుడిసెలు దగ్ధం అయ్యాయి. సిలిండర్ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. వీధిలోని ప్రజలు బయటికి వచ్చి భయం భయంతో తమ ఇంటిలోని సిలిండర్లను బయటకు తెచ్చి ఉంచారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.  ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాష్టం జరగలేదు.

Back To Top