కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో పాము కాటుకు మంగమ్మ అనే మహిళ మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాలు ఈలా ఉన్నాయి.. ఉదయం పత్తి పొలంలో ఎరువు చల్లడానికి వెళ్ళిన మంగమ్మ కు పాము కరిచిందని వెంటనే చికిత్స నిమిత్తం ఆటోలో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మంగమ్మ ను పరీక్షించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలపడంతో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.
