కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి. గడ్డా ఫక్రుద్దీన్

2025 ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి రెండిటికీ ప్రాముఖ్యత, రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇస్తున్నారని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని లో  టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ పత్రిక సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెన్షన్ రూ.4 వేలు, దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేశారని.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తో 16,347 పోస్టులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పేదలకు భోజనాలు పెట్టే 203 అన్న క్యాంటీన్ల, విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,400 కోట్లు సహాయం,  అమరావతి పునః నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు, విశాఖ రైల్వే జోన్ పనులు, తల్లికి వందనం, దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు, మత్య్సకారు లకు వేట నిషేధ సమయంలో రూ.20 వేలు రెట్టింపు  సహాయం, 90% సబ్సిడీ‌పై డ్రిప్ ఇరిగేషన్ ఇలా చెప్పుకుంటు పోతే అనేక పధకాలు ప్రజల కు కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. త్వరలో రైతు రుణమాఫీ, 15 ఆగస్టు కి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తుందని అన్నారు. మరెన్నో… సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు అమలు చేస్తారని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి జి ఎం డి షేక్ బాబా ఫక్రుద్దీన్ అలియాస్ గడ్డా ఫక్రుద్దీన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top