పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని. :-
- ఆదోని మండలం మండగిరి గ్రామపంచాయతీకి చెందిన అనీష్ ఫాతిమా సంబంధించి సర్వేనెంబర్ 204/బి 1 నందు 3.70 ఎకరాల భూమికి సంబంధించి ఆన్లైన్ మరియు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
- ఆదోని మండలం కల్లుబావి గ్రామంలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము సదరు ఇంటి స్థలానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు దయతో పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయవలసినదిగా కల్లుబావికి చెందిన బాలరాజు అర్జీ సమర్పించుకున్నారు.
- టిడ్కో ఇంటి కోసం గతంలో లక్ష రూపాయలు బ్యాంక్ డిడి ద్వారా చెల్లించాము. ప్రస్తుతం మాకు ఎటువంటి టిడ్కో గృహం మంజూరు కాలేదు. దయతో బ్యాంక్ డిడి ద్వారా చెల్లించిన నగదును తిరిగి ఇవ్వవలసినదిగా ఆదోని పట్టణం ఆర్టీసీ కాలనీకి చెందిన దాసరి యశోద అర్జీ సమర్పించుకున్నారు.
- ఆదోని మండలం గోనబావి గ్రామానికి చెందిన పకీరప్ప సంబంధించి 2024 – 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి నా యొక్క కూతురు వెన్నెలకు ఎనిమిదవ తరగతి బదులుగా ఆరవ తరగతి తప్పుగా ఆన్లైన్లో నందు నమోదు చేయడం ద్వారా కస్తూర్బా గాంధీ పాఠశాలలో 8వ తరగతి అడ్మిషన్ మంజూరు కాలేదు. దయతో నాకు కూతురుకు 8వ తరగతి అడ్మిషన్ మంజూరు చేయగలరని అర్జీ సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయపు పరిపాలన అధికారి సి. ఆర్. శేషయ్య, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ వేణు సూర్య, డి ఎల్ పి ఓ నూర్జహాన్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి, ఆర్ అండ్ బి ఎక్స్క్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, పంచాయితీ రాజ్ ఎక్స్క్యూటివ్ ఇంజనీర్ వెంకట ప్రసాద్, ఆర్టీవో నాగేంద్ర, డి ఎల్ డి వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.