అమరావతి: ఉండవల్లి లోని సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదోని నియోజకవర్గ అభివృద్ధి మరియు నియోజకవర్గ సమస్యల గురించి సీఎం కు వివరించరు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తూ ఆదోని అభివృద్ధికై కృషి చేస్తానని అలాగే అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఉమాపతి నాయుడు తెలిపారు.