News
మట్కా, నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని రణమండల కొండల్లో, యల్లమ్మ కొండలో మరియు ఇస్వి కొండలలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న నాటు సారా స్థావరాలపై సీఐ శ్రీ రామ్ వారి సిబ్బంది దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ద్వంశం చేశారు. రెండు రోజుల వరుస దాడుల్లో
అక్రమంగా నాటు సారా అమ్ముతున్న 5 మందిని అరెస్టు చేసి వారి వారి వద్ద నుండి 110 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.
మట్కా బుక్కీలను 6 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1లక్ష రూపాయలు స్వాధీనం చేసుకొని 11 మందిని రిమాండ్ కి తరలించారు..

వన్టౌన్ సిఐ శ్రీ రామ్ తెలిపిన వివరాలు యిలా ఉన్నాయి..
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO సోమన్న పర్యవేక్షణలో రెండు రోజులుగా రణమండల కొండల్లో, యల్లమ్మ కొండలో మరియు ఇస్వి కొండలలో తెల్లవారుజామున 05.00 గంటల నుండి దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాటు సారా కాస్తున్న బట్టీలను ద్వంశం చేసి, సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను పారబోసి, డ్రమ్ములను ద్వంశం చేశామని తెలిపారు. మట్కా నిర్వహిస్తూ నాటు సారా అమ్ముతున్న 11 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి నుండి 11 వైట్ కలర్ ప్లాస్టిక్ క్యాన్ లలో 110 లీటర్ల నాటు సారాను మరియు మట్కా డబ్బులు Rs. 1,00,000/- లను స్వాదీనము చేసుకుని వారిపై కేసులు నమోదు చేసి రిమాండు కు తరలించామని తెలిపారు.

ముద్దాయిల వివరాలు :-
నాటు సారాలు పట్టుబడిన వారిపై Cr. No. 140/2023 u/s 7(A) r/w 8(E) APP Act కింద
A1గా నిజాముద్దీన్ కాలనీకి చెందిన బోయ అంజిని, వయస్సు: 40 సంవత్సము,
A2గా వాల్మీకి నగర్ కు చెందిన బోయ మురళి, వయస్సు: 33 సంవత్సరాలు,
A3గా వాల్మీకి నగర్ కు చెందిన బోయ లాల్, వయస్సు: 40 సంవత్సరాలు,
A4గా శుక్రవారిపేటకు చెందిన బోయ హరి కృష్ణ, వయస్సు: 34 సంవత్సరాలు,
A5గా బోయగేరికి చెందిన బోయ నాగి రెడ్డి, వయస్సు: 34 సంవత్సరాలు,

మట్కాలో పట్టుబడిన వారిపై Cr. No. 140/2023 u/s 7(A) r/w 8(E) APP Act Sec 9(1) APG Act Matka కింద
A1గా మట్కరిగేరికి చెందిన భార్పెట్ మహమ్మద్ గౌస్, వయస్సు: 76 సంవత్సరాలు,
A2గా విక్టోరియా పేటకు చెందిన గొల్ల కన్న, వయస్సు: 41 సంవత్సరాలు,
A3గా నిజాముద్దీన్ కాలనీకి చెందిన సయ్యద్ ఖాజా, వయస్సు: 36 సంవత్సరాలు,
A4గా అమరావతి నగర్కు చెందిన షేక్ ఖాదర్ బాషా, వయస్సు: 59 సంవత్సరాలు,
A5గా బొబ్బులమ్మ దేవాలయం ప్రాంతనికి చెందిన గొల్ల శ్రీనివాసులు, వయస్సు: 54 సంవత్సరాలు,
A6గా మట్కరిగేరికి చెందిన ఈడిగ నరసింహులు గౌడ్, వయస్సు: 71 సంవత్సరాలు,
ముద్దాయిలను రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.

News
భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త
అదోని: తన భార్యను అత్తగారింటి నుండి పంపడం లేదన్న మనస్తాపంతో ఒక యువకుడు ఏకంగా రేడియో టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు మూడు గంటల పాటు హైడ్రామా నడిచిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో యువకుడు క్షేమంగా కిందకు దిగాడు.

అసలేం జరిగింది?.. ఆలూరు నియోజకవర్గం, చిప్పగిరి మండలం నేమకల్ గ్రామానికి చెందిన సురేంద్ర, అదే గ్రామానికి చెందిన నాగేశ్వరి అనే యువతిని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పండగ కోసమని నాగేశ్వరిని ఆమె తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. పండగ ముగిసినా తన భార్యను తిరిగి కాపురానికి పంపకపోవడంతో సురేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
టవర్ ఎక్కి హల్చల్ : శనివారం అదోనిలోని రేడియో టవర్ ఎక్కిన సురేంద్ర, తన భార్యను పంపకపోతే కిందకు దూకేస్తానని బెదిరించాడు. మూడు గంటల పాటు టవర్ పైనే ఉండి అందరినీ ఆందోళనకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న సీఐ రాజశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసుల హామీతో శాంతించిన యువకుడు .. సీఐ రాజశేఖర్ టవర్ కింద నుండి సురేంద్రతో మాట్లాడి నచ్చజెప్పారు. “నీ భార్యను, మీ అత్తమామలను స్టేషన్కు పిలిపించి మాట్లాడతాం. మీ ఇద్దరినీ కలిపి కాపురానికి పంపించే బాధ్యత నాది” అని సీఐ హామీ ఇవ్వడంతో సురేంద్ర శాంతించి కిందకు దిగివచ్చాడు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం భార్యపై ఉన్న ప్రేమతోనే ఆవేశంలో ఇలాంటి పని చేశాడని సీఐ మీడియాకు వివరించారు
News
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

