News
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు
అమరావతి. తేదీ 12.06.2024 ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకారోత్సవం గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామము వద్ద వున్న మేధా టవర్స్ ఐ.టి. పార్క్ ప్రదేశంలో జరుపుటకు నిర్ణయించినారు. ఈ కార్యక్రమానికి పలువురు VVIPలు , గవర్నర్, ముఖ్య నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనె అవకాశము ఉన్నందున. విజయవాడ నగరము నుండి గన్నవరం వైపుకు వెళ్ళు పలు వాహనముల రాకపోకలకు అసౌకర్యము కలుగకుండా ఉండేందుకు ట్రాఫిక్ని మళ్లిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

■ విజయవాడ నగరము లోని సాధారణ వాహనములు మళ్ళింపులు
★ విజయవాడ నుండి ఏలూరు మరియు విశాఖపట్నం వైపుకు వెళ్ళు కార్లు, ద్విచక్ర వాహనములు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బెంజ్ సర్కిలు నుండి కంకిపాడు-పామర్రు-హనుమాన్ జంక్షన్-ఏలూరు వైపుకు పంపబడును.
■ వియవాడ వెలుపల ట్రాన్స్ పోర్టు వాహనములు మళ్ళింపులు
★ విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపుకు వచ్చు వాహనములు: హనుమాన్ జంక్షన్ వద్ద నుండి నూజివీడు, జి. కొండూరు, ఇబ్రహింపట్నం ఇరువైపుల
■ విశాఖపట్నం నుండి చెన్నై వైపుకు వచ్చు వాహనములు
★ హనుమాన్ జంక్షన్ వద్ద నుండి గుడివాడ , పామర్రు, అవనిగడ్డ, పెనుముడి వారధి, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట, ఒంగోలు.
■ చెన్నై నుండి విశాఖపట్నం వైపుకు వచ్చు వాహనములు
★ ఒంగోలు, త్రోవగుంట, బాపట్ల, రేపల్లె, పెనుముడి వారధి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్
■ చెన్నై నుండి హైదరాబాద్ వైపుకు వెళ్ళు వాహనములు
★మేదరపెట్ల, అద్దంకి, నరసరావుపేట, పిడుగురాళ్ళ, మిర్యాలగూడెం, నల్గొండ నుండి వెళ్ళవలయును
■ హైదరాబాద్ నుండి గుంటూరు వైపుకు వచ్చు వాహనములు
★నల్గొండ, మిర్యాలగూడెం, దాచేపల్లి, పిడుగురాళ్ళ, నరసరావుపేట, అద్దంకి, మేదరమెట్ల నుండి వెళ్ళవలయును
■ RTC బస్సులు మళ్ళింపులు
■ విజయవాడ ఏలూరు వైపుకు వెళ్ళు బస్సులు
★PNBS నుండి ఓల్డ్ PCR జంక్షన్, ఏలూరు రోడ్, హోటల్ స్వర్ణ పాలెస్, చుట్టుగుంటగుణదల, రామవరప్పాడు రింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, నున్న బైపాస్, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు వైపుకు వెళ్ళ వలెను.

విజయవాడ రామవరప్పాడు రింగ్ నుండి గన్నవరం వైపుకు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమమునకు వెళ్ళు వాహనములు మరియు అంబుల్లన్స్ , అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనములు తప్ప మరి ఏ ఇతరవాహనములు గన్నవరం వైపుకు అనుమతించబడవు. పాసులు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించబడతాయి. కావున 12.06.2024 “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి గారి ప్రమాణ స్వీకారోత్సవం” కార్యక్రమం సందర్భముగా ట్రాఫిక్ అవాంతరాలు, ప్రజలకు ఇబ్బందులు సాధ్యమైనంత కనీస స్థాయిలో ఉండేందుకుగాను చేపట్టిన ట్రాఫిక్ మళ్ళిoపు చర్యలను నగర ప్రజలందరు గమనించి పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు..

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
