కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ లో భాగంగా డి.ఎస్.పి హేమలత ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. స్కూల్ కళాశాల సమీపంలో గుట్కాలు, సిగరెట్లు అమ్ముతున్న షాపులో సరుకును సీజ్ చేసి జరిమానా విధించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి హేమలత మాట్లాడుతూ కళాశాల స్కూలకు 100 మీటర్ల వరకు ఎటువంటి మత్తు పదార్థాలు అమ్మినా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు పలు షాపుల్లో దాడులు నిర్వహించామని మరియు బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగుతున్న ఇద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు.