కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టిడిపి తమ్ముళ్లు సంఘీభావ పాదయాత్ర..నారా లోకేష్ యువగళoపాదయాత్ర 200 రోజులు పూర్తిచేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు. ఇంటి వద్ద నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాదయాత్రకు మంచి స్పందన ఉందని రాబోయే రోజుల్లో టిడిపి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు అని తెలిపారు. ఈ పాదయాత్ర లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.
శ్రీశైలం లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విద్యుత్ తీగలు తెగి షాపులపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 12 షాపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అప్రమత్తమైన దేవస్థానం అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది దేవస్థానం ట్యాంకర్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. రెండు త్రిచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. షాపుల […]
డాక్యుమెంట్ రైటర్స్ పెన్ డౌన్
రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు అందులో భాగంగాకర్నూలు జిల్లా ఆదోని లో డాక్యుమెండేటర్లు కూడా పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు. షాపులను బంద్ చేసి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఆదోని టౌన్ దస్తావేజుకల సంఘం వైస్ ప్రెసిడెంట్ మోహన్ మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిష్టర్ లో ప్రవేశ పెట్టిన కార్డ్ పైమ్ 2.0 టెక్నాలజీ వలన ప్రజలకు మరియు ధస్తవేజు లేఖరులకు మరియు స్టాంప్ వెండర్స్ కు […]
ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న జయ మనోజ్ రెడ్డి
కర్నూలు జిల్లా ఆదోని 34 వార్డు ఎల్.బి స్ట్రీట్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి జయ మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గడపకు తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జయ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాళ్ళకి అమ్మ ఒడి, నాడు నేడు కింద స్కూళ్ళు సుందరికరణ, రజకులకు నాయి బ్రాహ్మణులకు మౌజాన్లకు పాస్టర్లకు, బ్రాహ్మణులకు చేనేతలకు, డ్వాక్రా మహిళలకు ఇలాగ అనేక వర్గాలకు అండగా వైఎస్ఆర్సిపి […]
ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 7 వరకు సమరభేరి
◆ దేశంలో సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో నిత్యవసర వస్తువుల ధరలు..◆ 4 నుండి 8 శాతానికి పెరిగిన నిరుద్యోగ సమస్య..◆ 5 రకాల పన్నుల పేరుతో రాష్ట్రంలో రెండింతలు పెరిగిన విద్యుత్ చార్జీలు..◆ సమస్యల పరిష్కారం కోసం పోరాటం..◆ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 7 వరకు సమరభేరి.. కర్నూలు జిల్లా ఆదోని మండలం మధిర గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల నుండి సంతకాలను సేకరణ చేయడం జరిగిందని సిపిఎం […]
ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి
కర్నూలు జిల్లా ఆదోని మండలం హానవాలు గ్రామం సమీపంలో ఆగి ఉన్న ఎద్దుల బండిని మోటార్ సైకిల్ తోఢీ కొట్టి సృహ తప్పి పడిపోయిన గుర్తుతెలియని వ్యక్తి. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు. ఈ వ్యక్తి యొక్క మరియు మోటార్ సైకిల్ వివరాలు తెలిసినవారు ఇస్వి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కు Cell: 9121101143 ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకే క్రీడా పోటీలు
విద్యార్థిని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3160 గవర్నర్ మాణిక్ ఎస్ పవార్ అన్నారు.కర్నూలు జిల్లా అదోని స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని గ్రామాల నుండి 53 పాఠశాలల దాదాపు 2500 మంది విద్యార్థిని విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి […]
ప్రజలకు సమస్య వస్తే దేవుడు కంటే ముందు పోలీస్ స్టేషన్ కు వస్తారు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం సనా ఫంక్షన్ హాల్లో హోంగార్డ్ మరియు హెడ్ కానిస్టేబుళ్లకు అవగాహన సదస్సు సమావేశం నిర్వహించిన రాయలసీమ రేంజ్ కామాండెంట్ ఎం.మహేష్ కుమార్. ఈ సందర్భంగా కామాండెంట్ .మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు సమస్య వస్తే దేవుడు దెగ్గరకు కంటే ముందు పోలీస్ స్టేషన్ కు వస్తారు అందుకని ఫిర్యాదుదారునికి ప్రేమతో పలకరించాలని పోలీసులపై నమ్మకం కలిగేలా అతనికున్న సమస్యను పరిష్కరించే విధంగా పాజిటివ్ గా మాట్లాడాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్లో నారా లోకేష్ పై ఫిర్యాదు
కర్నూలు జిల్లా ఆదోని ఇస్వీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు .. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నారా లోకేష్ పై చర్యలు తీసుకోవాలి అని ఆదోని ఇస్వీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జిల్లా సోషల్ మీడియా కో -కన్వీనర్ పెద్ది రెడ్డి శ్రీనివాస రెడ్డి..
చిరుత పులి కలకలం
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్ద పెండేకల్లు గ్రామంలో ఉన్న కొండ ప్రాంతంలో చిరుత పులి కలకలం సృష్టించింది. గ్రామస్థులకు పులి కనిపించడంతో భయంతో పొలం పనులకు వెళ్లడం వదిలి ఎవరు ఇళ్లల్లో వారు ఉండిపోయారు, గొర్రెల కాపరులు బిక్కు బిక్కుమంటూ ప్రాణ భయంతో బతుకుతున్నారు, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుత పులిని బంధించి సురక్షిత ప్రాంతంలో వదలాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.