రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు అందులో భాగంగా
కర్నూలు జిల్లా ఆదోని లో డాక్యుమెండేటర్లు కూడా పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు. షాపులను బంద్ చేసి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఆదోని టౌన్ దస్తావేజుకల సంఘం వైస్ ప్రెసిడెంట్ మోహన్ మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిష్టర్ లో ప్రవేశ పెట్టిన కార్డ్ పైమ్ 2.0 టెక్నాలజీ వలన ప్రజలకు మరియు ధస్తవేజు లేఖరులకు మరియు స్టాంప్ వెండర్స్ కు నష్టం జరుగుతుంది అని దీనివలన రాష్ట్రవ్యాప్తంగా 50,000 మంది ఉన్నటువంటి దస్తా వేజు రైటర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం పరిచారు. కార్డ్ పైమ్ 2.0 టెక్నాలజీ వలన పనిలో పారదర్శకత లోపించి అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.