అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏలను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.. G.O. Ms. No 66 ద్వారా ఉద్యోగులకు డీఏ.. G.O. Ms. No. 67 ద్వారా పెన్షనర్లకు DR 2.73% మంజూరు చేసింది. ఈ కొత్త డీఏను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ప్రభుత్వం అందజేయనుంది. కాగా జనవరి 2022 నుంచి జూన్ 2023 […]
జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు..!
GST collection: దిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో (GST collections) సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్ నెలకు గానూ రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి.. గతేడాది ఏప్రిల్లో రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లు 12 శాతం మేర వృద్ధి నమోదైంది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఇదే తొలిసారి.ఏప్రిల్ నెలకు గానూ రూ.1,87,035 కోట్లు వసూలు అవ్వగా.. అందులో సీజీఎస్టీ కింద రూ.38,440 […]
తాసిల్దార్ వెంకటలక్ష్మి ప్రజలకు శుభవార్త తెలిపారు
కర్నూలు జిల్లా ఆదోని తాసిల్దార్ వెంకటలక్ష్మి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు శుభవార్త తెలిపారు. రేపటినుండి చిరుధాన్యాల కింద ఒక రేషన్ కార్డుకు ఉన్న లబ్ధిదారునికి ఒక కేజీ జొన్నలు పంపిణీ చేయడం జరుగుతుందని. ఒక కార్డు లబ్ధిదారునికి 20 కేజీలు బియ్యంలో ఒక కేజీ తగ్గించి ఒక కిలో జొన్నలు ఇవ్వడం జరుగుతుందని తాసిల్దార్ వెంకటలక్ష్మి తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రేషన్తోపాటు జొన్నలు కూడా పంపిణీ చేస్తామని తాసిల్దార్ వెంకటలక్ష్మి.తెలియజేశారు.
గాలివానకి 60 అడుగుల దూరంలో పడింన గోడౌన్ పై కప్పు
కర్నూలు జిల్లా ఆదోనిలో రాత్రి కురిసిన గాలివాన బీభత్సం సృష్టించాయి. ఎమ్మిగనూరు బైపాస్ లో గాలివానకి 60 అడుగుల దూరంలో పడింన శబరి టైల్స్ గోడౌన్ పై కప్పు.. సుమారు 3లక్ష రూపాయలు ఆస్తి నష్టం. పట్టణంలో చిన్నపాటి వర్షం వస్తేనే సముద్రం లా మారింది.
ఆదోని సబ్ డివిజన్ పరిధిలో కురిసిన వర్షల వివరాలు
ఆదోని సబ్ డివిజన్ పరిధిలో కురిసిన వర్షాలు వివరాలను వెల్లడించిన అధికారులు కౌతాళం Kowthalam. 5.2 కోసిగి Kosigi. 4.2మంత్రాలయం Mantralayam 6.8నందవరం Nandavaram. 5.2గోనెగండ్ల Gonegandla. 24.2ఎమ్మిగనూరు Yemmiganur 12.4పెద్దకడబ Peddakadabur 0.0ఆదోని Adoni. 12.6హోలాగుంద Holagunda. 1.4 Total. 72.0Average Rainfall. 8.0Divn dyso I/c. Adoni
మంత్రాలయం రైల్వే స్టేషన్ లో 7 నెలల బాలుడు కిడ్నాప్
7 నెలల బాలుడు అదృశ్యమైన సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. కాచాపురం గ్రామానికి చెందిన అంజి, అంకమ్మ దంపతులు పాత రైల్వే స్టేషన్ లో పాన్పు పై నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి 7 నెలల బాలుడు రామును అపహరించారు. గమనించిన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో విచారించగా కన్పించకపోవడం తో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఆదోని రైల్వే పోలీస్ […]
ఆదోని వెయిట్ & మెజర్మెంట్ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా అదోనిలో శనివారం తూనికలు మరియు కొలతల అధికారుల దాడులు నిర్వహించారు. తిమ్మారెడ్డి బస్టాండ్ ప్రక్కన పెట్రోల్ బంక్ లో ఉన్న బాలాజీ వేయింగ్ బ్రిడ్జ్ లో 40కేజీల తేడా వస్తుందని నాన్ స్టాండర్డ్ క్రింద కేసునమోదు చేసామని అధికారులు తెలిపారు. అసిస్టెంట్ కంట్రోల్ శ్రీరామ్ మాట్లాడుతూ తూకాలలో తేడాలు వస్తున్నాయని రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటినుంచి వేయింగ్ మిషన్లపై కూడా నిఘా ఉంచి దాడులు చేస్తామని తెలిపారు. […]