News
కన్న బిడ్డను చంపుకున్న కసాయి తల్లి
కర్నూలు జిల్లా కోసిగి మండలం దేవరబెట్టు గ్రామంలో ఓ తల్లి పది నెలల కొడుకును గొంతు నలిపి చంపి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన బుధవారం తుంగభద్ర పాత రైల్వే స్టేషన్ స మీపంలో చోటుచేసుకుంది. దేవరబెట్టు గ్రామానికి చెందిన కొండ రామాంజనేయులు ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన హనుమంతమ్మకు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది వీరికి ఒక కుమార్తె ఒక కొడుకు ఉన్నారు గత కొన్ని నెలలుగా హనుమంతమ్మ మానసిక స్థితి సరిగ్గా లేక భర్త రామాంజనేయులు తో గొడవపడి పుట్టినిల్లు కి వెళ్ళింది. బుధవారం సాయంత్రం తన పది నెలల విశ్వనాథ్ ను ఎత్తుకొని తుంగభద్ర పాత రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్లి చిన్నారి గొంతు నలిపి చంపేసింది. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళింది. సరిగ్గా సమయానికి అమెను వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు స్థానిక లు ఆమెను అడ్డుకున్నారు. అయితే ఆ తల్లి సంకలో నిర్జీవిగా ఉన్న విశ్వనాథుని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనతో విషాదంతో దేవరబెట్టు మునిగిపోయింది.

భాషను మార్చుకోవడానికి ఈ క్రింది వీడియోని చూడండి
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




