News
ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. డి.ఎస్.ఎఫ్ డిమాండ్.
కర్నూలు జిల్లా ఆదోని లో ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ఆదోని డివిజన్ లో ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద దోపిడీ చేస్తూ అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా RIO ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కళాశాలపై తక్షణమే విజిట్ చేసి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘంగా ఉన్నత విద్యాధికారులకు డిమాండ్ చేశారు. విద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తే కళాశాల ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో DSF నాయకులు కిరణ్, మోహన్, హరికృష్ణ, విక్రమ్, తేజ తదితరులు పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




