News
రాష్ట్రంలో IAS ల బదిలీలు,పోస్టింగ్స్
సత్యసాయి జిల్లా జేసీ గా అభిషేక్ కుమార్
అల్లూరి జిల్లా జేసీ గా కొల్లాబత్తుల కార్తీక్.
MSME కార్పోరేషన్ సీఈవో గా సేదు మాధవన్.
మిడ్ డే మీల్స్ స్పెషల్ ఆఫీసర్ హ ఎస్ఎస్ శోభిక.
పాడేరు సబ్ కలెక్టర్ గా పెద్దిటి ధాత్రి రెడ్డి.
పెనుకొండ సబ్ కలెక్టర్ గా అపూర్వ భరత్
కొవ్వూరు సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాత్సవ
కందుకూరు సబ్ కలెక్టర్ గా గొబ్బిల విద్యాధరి.
తెనాలి సబ్ కలెక్టర్బ్గా ప్రకార్ జైన్
మార్కాపురం సబ్ కలెక్టర్ గా రాహుల్ మీనా
ఆదోని సబ్ కలెక్టర్ గా శివ్ నారాయణ్ శర్మ
రంపచోడవరం సబ్ కలెక్టర్ గా ఎస్.ప్రశాంత్ కుమార్.
శాప్ వీసీ,ఎండీ గా హెచ్.ఎం. ధ్యానచంద్ర.
విలేజ్, వార్డు సెక్రటేరియట్ డైరెక్టర్ గా టీఎస్ చేతన్.
బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గా జె. శివ శ్రీనివాస్
తిరుపతి జిల్లా జేసీ గా శుభం బన్సాల్.
విలేజ్,వార్డు సెక్రటేరియట్ అడిషనల్ డైరెక్టర్ గా గీతాంజలి శర్మ.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




