News
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి.. సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ.
బైజూస్ కంటెంట్ తో ఉన్న ట్యాబ్ ని ఉపయోగించుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని నెహ్రూ మెమోరియల్ స్కూల్లో జగనన్న 2వ విడత ఉచిత బైజూస్ ట్యాబ్ లను విద్యార్థులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ ట్రాక్టర్ మధుసూదన్ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ట్యాబ్లను పంపిణీ చేశారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థి దశలోనే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. మేము చదివే రోజుల్లో ఇటువంటి అవకాశాలు ఉండేవి కాదు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సబ్ కలెక్టర్ సూచించారు.
ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నాడు – నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యా రంగానికి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తల్లిదండ్రులకు విద్య భారం కాకుండా చేశారన్నారు. ఇంగ్లీష్ మీడియం తో ప్రపంచం తో పోటీ చేసే విధంగా మన విద్యార్థులు కావాలని ఇంగ్లీష్ మీడియాని ఏర్పాటు చేశారన్నారు.
ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ… విద్యా వైద్య రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టారన్నారు. సాధారణ విద్యార్థులకు కూడా విదేశీ విద్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నారు. మరియు ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షలు ఉన్న పరిమితిని 25 లక్షల వరకు వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. జగనన్న సివిల్ ప్రోత్సాహం ద్వారా క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఆర్థికమైన సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కే శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంఈఓ శివ రాముడు తదితరులు పాల్గొన్నారు.



News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
