News
అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలి. జెసి నారపురెడ్డి మౌర్య

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లోని సిల్వర్ జూబ్లీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “జగనన్నకు చెబుదాం-స్పందన” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు సంబంధిత అధికారులు ఎలా అంటే అలా ఎండార్స్మెంట్ లు ఇవ్వకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలని అపుడే రీ ఓపెన్ కేసుల శాతం తగ్గే అవకాశముందని అన్నారు .
ముఖ్యంగా ఆర్జీలలో రెవెన్యూ కి సంబంధించి మిగులు భూమి, అడ్డంగల్ కరెక్షన్స్ లాంటి పరిష్కారమయ్యే చిన్న చిన్న సమస్యలకు కూడా అర్జీదారులు కర్నూలు జిల్లాకు వచ్చి మరి అర్జీలు ఇస్తున్నారని ఇక్కడ మీ పరిధిలో పరిష్కారం అయ్యే వాటికి ఇక్కడే పరిష్కారం చేయాలని, పరిష్కారం చేయలేని వాటికి ఎందుకు చేయలేకపోతున్నాము అనేది కూడా స్పష్టంగా ఎండార్స్మెంట్ లో వివరించాలన్నారు. లబ్ధిదారులకు కేటాయించిన టిడ్కో ఇళ్ళలో 3 నెలలు నుండి కరెంట్ బిల్లులు కట్టలేదని వారి ఇళ్ళ వద్దకు వెళ్లి కరెంట్ కనెక్షన్ కట్ చేస్తున్నారని మీడియా ప్రతినిధులు స్పందనలో జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా అటువంటి సమస్యల పై తగిన చర్యలు తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని తెలిపారు..తొలుత స్పందన కార్యక్రమం కంటే ముందు అర్జీలు నమోదు చేసే కేంద్రాన్ని పరిశీలిస్తూ అర్జిదారుడు ఇచ్చిన అర్జీ కి సంబంధిత విభాగం కింద తప్పులు లేకుండా నమోదు చేయాలని ఎన్రోల్మెంట్ ఆపరేటర్లకు జాయింట్ కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి, ఆదోని తహసిల్దార్ వెంకట లక్ష్మీ, ఆదోని మునిసిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంపిడిఒ గీత వాణి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు