Connect with us

News

ఆదోనిలో వైఎస్ఆర్ సి పి సంబరాలు

Published

on

సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 4 ఏళ్ళు అయిన సందర్భంగా కర్నూలు జిల్లా అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో స్థానిక మెహబూబయ ప్యాలెస్ లొ కార్యకర్తలు, నాయకుల మధ్య కేకే కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళా నాయకులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.

ఎమ్మెల్యే సాయి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాక పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగిందని మానిఫెస్టోనీ 98.5 శాతం పూర్తి చేసిన పార్టీ YSRCP యే అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి ఆదోని అసెంబ్లీ గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తాం అని కార్యకర్తలే మా బలం వారే మా కుటుంబానికి అండ అని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ
సీఎం జగన్ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగన్ అన్నతో సాధ్యం అయిందని దేశంలో ఎవ్వరూ చేయని సంక్షేమ పాలన అందించారని అన్నారు. సీఎం జగన్ బీసీ ల పక్షపాతి అని దేశంలో ఎవ్వరూ ఇవ్వనన్ని పదవులు బీసీ లకు ఇచ్చి వారికి వెన్ను దన్నుగా నిలిచారు సీఎం జగన్ అని తెలిపారు.

సంబరాల్లో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ శాంత, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాజహర్ అహ్మద్, రాష్ట్ర విరాసేవ లింగాయిత్ కారపపరేషన్ డైరెక్టర్ మంజుల, మునిసిపల్ వైస్ చైర్మన్ లు గౌస్ అహ్మద్, నరసింహులు మరియు కౌన్సిలర్లు, సర్పంచ్ లు, డైరెక్టర్ లు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending