News
ఆదోనిలో వైఎస్ఆర్ సి పి సంబరాలు
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 4 ఏళ్ళు అయిన సందర్భంగా కర్నూలు జిల్లా అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో స్థానిక మెహబూబయ ప్యాలెస్ లొ కార్యకర్తలు, నాయకుల మధ్య కేకే కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళా నాయకులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.
ఎమ్మెల్యే సాయి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాక పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగిందని మానిఫెస్టోనీ 98.5 శాతం పూర్తి చేసిన పార్టీ YSRCP యే అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి ఆదోని అసెంబ్లీ గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తాం అని కార్యకర్తలే మా బలం వారే మా కుటుంబానికి అండ అని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ
సీఎం జగన్ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగన్ అన్నతో సాధ్యం అయిందని దేశంలో ఎవ్వరూ చేయని సంక్షేమ పాలన అందించారని అన్నారు. సీఎం జగన్ బీసీ ల పక్షపాతి అని దేశంలో ఎవ్వరూ ఇవ్వనన్ని పదవులు బీసీ లకు ఇచ్చి వారికి వెన్ను దన్నుగా నిలిచారు సీఎం జగన్ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ శాంత, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాజహర్ అహ్మద్, రాష్ట్ర విరాసేవ లింగాయిత్ కారపపరేషన్ డైరెక్టర్ మంజుల, మునిసిపల్ వైస్ చైర్మన్ లు గౌస్ అహ్మద్, నరసింహులు మరియు కౌన్సిలర్లు, సర్పంచ్ లు, డైరెక్టర్ లు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
