News
ఆదోనిలో వైఎస్ఆర్ సి పి సంబరాలు
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 4 ఏళ్ళు అయిన సందర్భంగా కర్నూలు జిల్లా అదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో స్థానిక మెహబూబయ ప్యాలెస్ లొ కార్యకర్తలు, నాయకుల మధ్య కేకే కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళా నాయకులు కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.
ఎమ్మెల్యే సాయి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశాక పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగిందని మానిఫెస్టోనీ 98.5 శాతం పూర్తి చేసిన పార్టీ YSRCP యే అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి ఆదోని అసెంబ్లీ గెలిచి సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తాం అని కార్యకర్తలే మా బలం వారే మా కుటుంబానికి అండ అని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ
సీఎం జగన్ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగన్ అన్నతో సాధ్యం అయిందని దేశంలో ఎవ్వరూ చేయని సంక్షేమ పాలన అందించారని అన్నారు. సీఎం జగన్ బీసీ ల పక్షపాతి అని దేశంలో ఎవ్వరూ ఇవ్వనన్ని పదవులు బీసీ లకు ఇచ్చి వారికి వెన్ను దన్నుగా నిలిచారు సీఎం జగన్ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ శాంత, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాజహర్ అహ్మద్, రాష్ట్ర విరాసేవ లింగాయిత్ కారపపరేషన్ డైరెక్టర్ మంజుల, మునిసిపల్ వైస్ చైర్మన్ లు గౌస్ అహ్మద్, నరసింహులు మరియు కౌన్సిలర్లు, సర్పంచ్ లు, డైరెక్టర్ లు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
