News
AP: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏలు విడుదల

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏలను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది..
G.O. Ms. No 66 ద్వారా ఉద్యోగులకు డీఏ.. G.O. Ms. No. 67 ద్వారా పెన్షనర్లకు DR 2.73% మంజూరు చేసింది. ఈ కొత్త డీఏను జూలై 1, 2023 నుంచి జీతంతో కలిపి ప్రభుత్వం అందజేయనుంది.
కాగా జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను.. సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించనున్నారు. ఈ కొత్త డీఏతో కలిపి ఉద్యోగుల మొత్తం డీఏ 22.75 శాతం కానుంది. డీఏ మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు..
News
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

ఆదోని 02 07 25:
రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు


News
తుంగభద్రా డ్యాం దిగువకు నీరు విడుదల

తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ..
తుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.20 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 77.144 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 32767 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1701 క్యూసెక్కులు
బుధవారం 02 వ తేదీ ఉదయం 11 గంటలకు 2000 క్యూసెక్కుల నుంచి 20000 క్యూసెక్కులు నీరుని నదిలోకి వదులుతున్నాట్లు డ్యాం అధికారులు తెలిపారు. నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

News
స్కూల్ బస్సులు తనిఖీలు నిర్వహించిన అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని లో మంగళవారం పోలీసులు మరియు ఆర్టీవో అధికారులు సంయుక్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ నిర్వహించారు. స్కూల్ బస్సులను, వాటికి సంబంధించిన రికార్డ్స్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యానికి మరియు డ్రైవర్లకు తగు సూచనలు చేశారు. డ్రైవర్లు యూనిఫామ్ కలిగి ఉండాలని పిల్లల పట్ల మర్యాదగా ఉంటూ, డోర్ స్టెప్స్ దగ్గర పిల్లలు నిలబడకుండా మరియు కిటికీ లోంచి తలలు బయటికి పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇతనిఖిలలో ఆదోని డిఎస్పి హేమలత, ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిర దీప్తి, ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు వారి సిబ్బంది పాల్గొన్నారు.



-
News3 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-6-2025
-
News4 weeks ago
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం
-
News1 day ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 01-07-2025
-
News2 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 30-6-2025
-
News3 weeks ago
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్
-
News4 weeks ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News5 days ago
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు
-
News4 weeks ago
రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ