కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబళం గ్రామంలో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించరు. నబి ట్రేడర్స్ లో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా, కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా తీసుకొచ్చిన 76 డి ఎ పి ఎరువుల సంచులను సీజ్ చేశారు. వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉన్నట్లు వ్యవసాయ శాఖా అధికారులు తెలిపారు. నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు.