కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ మంగళవారం ఉదయం నుండి వివిధ ప్రాంతాల్లో బాలికల కళాశాల రైతుబజార్ సంతోష్ నగర్ ఎల్ బి స్ట్రీట్, షేర్ ఖాన్ కొట్టాలు తిక్క స్వామి దర్గా రోడ్డు లలో జరుగుతున్న శానిటేషన్ వర్క్ ని పరిశీలించారు. అనంతరం అన్న క్యాంటీన్లో పేద ప్రజలకు పెడుతున్న భోజనాలను అక్కడ నిర్వహిస్తున్న శానిటేషన్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీ న్ లో ఎటువంటి అసౌకర్యం లేకుండా భోజనాలు అందించాలని అక్కడున్న సిబ్బందిని ఆదేశించారు.