News
భారత దేశంలో ప్రతి రోజూ 8 మంది అపహరణకు గురి అవుతున్నారు
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం ఫెయిత్ హోమ్ ఫర్ చిల్రెన్ మరియు ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ది మ్యుమెంట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ వారి ఆధ్వర్యంలో భారత దేశంలో ఏక కాలంలో 15 రాష్ట్రాలలో, 100 పైగా ప్రదేశాల్లో, మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) మీద జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథితులుగా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, డి.ఎస్. సోమన్న పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి జెండా ఊపి ర్యాలీ నీ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ భారత దేశంలో ప్రతి రోజూ 8 మంది అపహరణకు గురి అవుతున్నారని, వారిలో అమ్మాయిలు మరియు మహిళల సంఖ్య 90% ఉందని కావున విద్యార్థులు జాగ్రత్తగా నడుచుకోవాలని హెచ్చరించారు.ఈ ర్యాలీ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల నుండి ప్రారంభమై ఎమ్మిగనూరు సర్కిల్ వరకు సాగి అక్కడ మానవ హారంగా ఏర్పడి ప్రజలను చైతన్య వంతులను చేసే స్లొగన్స్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెయిత్ హోమ్ నిర్వాహకులు Dr. డేనియల్ ప్రేమ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ బాలస్వామి, nss అధికారులు జోనాథన్, ఉమాదేవి, వెంకట్రమి రెడ్డి, NCC అధికారులు కెప్టెన్ గోవిందు, లెఫ్టినెంట్ ఈరమ్మ, LGA సభ్యులు, ప్రేమ్ కుమార్, మనోజ్, సలోమీ, అనితా, ఉష విద్యార్థులు పాల్గొన్నారు.





News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




