News
ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయండి
కర్నూలు జిల్లా ఆదోని లో కాలేజ్ చదువుతున్న విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించేందుకు సిద్ధమవుతామని మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించరు. ఎంతోమంది పేద విద్యార్థులు కళాశాలలో ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నరని అలాగే డిగ్రీ పూర్తయిన విద్యార్థులు బీఈడీ పూర్తయిన విద్యార్థులు ఈజీ పూర్తయిన విద్యార్థులు కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ఫీజు కళాశాలలో కడితేనే ఇస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని DSF విద్యార్థి సంఘం గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




