News
ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థిని హత్య ?
కర్నూలు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతకం. కలకలం రేపుతున్న మైనర్ విద్యార్థిని మృతి. ప్రేమ పేరుతో జరిగిన మైనర్ విద్యార్థిని మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్న మృతి రాలి తల్లిదండ్రులు.

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన అశ్విని పురుగుల మందు తాగి అనుమానాస్పద మృతి చెందింది. అశ్విని తండ్రి విరేష్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. పత్తికొండ మోడల్ స్కూల్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంటుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థిని. తన కూతురును ప్రేమించడం లేదని బలవంతంగా పురగుల మందు త్రాపి హత్య చేసాడు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అశ్విని ని చుట్టూ గత కొద్ది రోజులుగా సున్నీ అనే యువకుడు ప్రేమించమని వెంటపడుతున్నాడని తెలియడంతో సన్ని కి పలుమార్లు హెచ్చరించమని తెలిపారు. శుక్రవారం పొలం పనులకు వెళ్లగా ఎవరు లేని తమ ఇంట్లోకి దూరి అమ్మాయి మీద బలవంతం చేసినందుకు పురుగుల మందు తాగినానని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పి చనిపోయిందని తండ్రి తెలిపాడు. మా అమ్మాయిని పురుగుల మందు తాపీ చంపినడా లేక ఆత్మహత్య చేసుకుందా తెలియదని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




