News
గ్రామ సమస్యలపై పోరాడాలని తీర్మానం
కర్నూలు జిల్లా దొడ్డనకేరి గ్రామంలో కే మునిస్వామి అధ్యక్షతన సిపిఎం పార్టీ శాఖ మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే. లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు డి. రామాంజనేయులు హాజరయ్యారు. గ్రామంలో ప్రధానంగా సిసి రోడ్లు, డ్రైనేజీలు మరియు విద్యుత్ స్తంభాలు, త్రాగునీటి పైప్ లైన్ లీకేజీలు వంటి సమస్యలు ఉన్నాయని, సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో స్థానిక సమస్యలపై పోరాడాలని మహాసభలో తీర్మానం చేశారు. దొడ్డనకేరి గ్రామంలో హోటల్ గిడ్డయ్య ఇంటి నుండి స్మశానం వరకు (నెమలికల్ రోడ్డుకు) సిసి రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించాలని.. దొడ్డనకేరి నుండి సుల్తానాపురం వరకు రైతుల పొలాలకు వెళ్లే రస్తాకు గ్రావెల్ వేయాలని, దొడ్డనకేరి నుండి బల్లెకల్ వరకు రైతుల పొలాలకు వెళ్లే ప్రస్తుత గ్రావెల్ వేయాలని సిపిఎం పార్టీ దొడ్డనకేరి శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మహాసభలకు మండల నాయకులు నాగరాజు శాఖ సభ్యులు ఈరన్న, తిక్కన్న, కమల్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




