News
3 లక్షల 50వేల విలువ చేసే కర్ణాటక మద్యం, నాటు ధ్వంసం
కర్నూలు జిల్లా అదోని ఇస్వీ బ్రిడ్జి సమీపంలో సెబ్ డిఎస్పీ వినోద్ కుమార్, సెబ్ సిఐ విన్నీ లత ఆధ్వర్యంలో వివిధ కేసులో పట్టుబడిన కర్ణాటక మధ్యాన్ని, నాటు సారాను ట్రాక్టర్ తో ధ్వంసం చేశారు. డీఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్, మే 2024 లో 37 కేసులో పట్టుబడ్డ 586 లీటర్ల మధ్యం ధ్వంసం చేస్తున్నామని వీటి విలువ సుమారు 3 లక్షల 50 వేల వరకు ఉంటుందని తెలిపారు. మొత్తం 37 కేసుల్లో ట్యాక్స్ కట్టని ఒక కేసులో 1.8 లీటర్లు, 8 నాటు సారా కేసుల్లో 108 లీటర్లు, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకుని వస్తుండగా పట్టుకున్న 28 కేసులు లో 475 లీటర్లు వున్నాయని తెలిపారు.

కర్ణాటక మధ్యాహ్నం ఉపాధిగా చేసుకుని అక్రమంగా తరలిస్తున్నారని వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి 40 వేల రూపాయలు జరిమానా కట్టించి వారిపై నిఘా పెట్టామని ఈ పనులు మానుకోకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ అక్రమ కర్ణాటక మద్యం తరలిస్తున్న వారిని పూర్తిగా అరికట్టలేమా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సెబ్ డి.ఎస్.పి వినోద్ కుమార్ సమాధానం ఇస్తూ 63 మంది సిబ్బంది 112 మంది అధికారులు 7 చెక్పోస్టు లు ఏర్పాటుచేసి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




