కర్నూలు జిల్లా ఆదోని నూతన తాసిల్దార్ గా ఆర్. శివ రాముడు బాధ్యతలు స్వీకరించరు. అనంతరం ఆదోని సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మను పుష్ప గుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విలేకరులతో తాసిల్దార్ శివ రాముడు మాట్లాడుతూ గతంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో పనిచేస్తూ బదిలీపై ఆదోనికి వచ్చానని తెలిపారు. ప్రజల సమస్యలను ఎంత త్వరగా అయితే అంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు.