News
ఆదోని డివిజన్ నూతన ఆర్డీవో, తాసిల్దార్ల వివరాలు
కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో రానున్న ఆర్డిఓ ఎమ్మార్వో ల వివరాలు..
ఆదోని ఆర్డిఓ గా కె వాసుంధర
ఆదోని తాసిల్దార్ గా ఆర్ శివరాముడు
పత్తికొండ ఆర్డిఓ గా కే సతీష్
పత్తికొండ తాసిల్దారుగా ఈ వెంకటలక్ష్మి
పెద్ద కడుబూర్ తాసిల్దారుగా ఎస్ శ్రీనాథ్
కౌతాళం తాసిల్దార్ గా కే మల్లికార్జున స్వామి
మంత్రాలయం తాసిల్దార్ గా ఎస్ రవి
కోసిగి తాసిల్దారుగా నిత్యానంద రాజు లు
ఎమ్మిగనూరు తాసిల్దార్ గా ఏ శేష పని
నందవరం తాసిల్దారుగా శ్రీనివాసులు
గోనెగండ్ల తాసిల్దారుగా కె కుమారస్వామి
దేవనకొండ తాసిల్దారుగా బి. జయన్న
హాలహర్వి తాసిల్దారుగా ఎస్ నజ్మా భాను ఆలూరు తాసిల్దార్ గా ఆర్ గోవిందు సింగ్
ఆస్పరి తాసిల్దారుగా శివశంకర్ నాయక్
క్రిష్ణగిరి తాసిల్దార్ గా డి చంద్రశేఖర్
మద్దికేర తాసిల్దార్ గా డి హుస్సేన్ సాహెబ్
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




