News
జీతాల పెంపు పేరుతో రోడ్డున పడేశారన్నారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి.
_ ఏపీలో ఆటవిక పాలన
_ సూపర్ సిక్స్ పథకాల అమలు పై చేతులెత్తిన చంద్రబాబు
_ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు, హామీలపై ప్రజలు, వైస్సార్సీపీ నాయకులు ప్రశ్నించకూడదని అక్రమ కేసులు.
_ జీతాల పెంపు పేరుతో వలంటీర్లను రోడ్డున పడేశారు.
_ ప్రభుత్వం తీరు పై మండిపడ్డ మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి..
కర్నూలు జిల్లా మంత్రాలయం : ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ప్రభుత్వం తీరు పై మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ పథకాలను ఆశ చూపి అధికారంలోకి రాగానే అమలు చేయలేమంటు చెతులేతేశారన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయలేక ప్రజలు, వైస్సార్సీపీ నాయకులు ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వలంటీర్లను విమర్శించిన చంద్రబాబు ఎన్నికల సమయంలో జీతాల పెంపు పేరుతో రోడ్డున పడేశారన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తు శాంతి భద్రతల పై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




