News
పాండవగల్ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మ ని కొనసాగించాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మని కొనసాగించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి మేటిలు ఉపాధి కూలీలు ఆదోని ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ గత 2006 సంవత్సరం నుండి ఇప్పటివరకు 18 సంవత్సరాలుగా పాండవగల్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మ పనుల్లో ఎలాంటి అవకతవకలు, అవినీతి, అక్రమాలు లేకుండా నీతి, నిజాయితీగా,మన, తన తారతమ్యం లేకుండా గ్రామంలో అందరికీ పనులు కల్పిస్తూ ఉందని అలాంటి ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించడం వల్ల గ్రామంలో పని నిలిచిపోయి ఉపాధి కూలీలకు నష్టం కలుగుతుందని ఆమెను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి టిడిపి, ఒకసారి వైసీపీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పాండవగల్ ఫీల్డ్ అసిస్టెంట్ ను ఎవరు తొలగించలేదని ప్రస్తుతం ఉపాధి అధికారులు అధికార పార్టీ ఒత్తిడి మేరకు తొలగించాలని చూడడం సరికాదని ఆయన అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి ఎంపీడీవో మరియు అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి ఏపీఓ అధికారులు కు గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, ఉపాధి మేటిలు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని వారికి అందజేశం అని అన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఈ సమస్యను మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు, రామాంజనేయులు, సిఐటియు నాయకులు పాండురంగ, ఉపాధి హామీ మేటీలు కే హుస్సేని, అనంత ఆంజనేయ, హనుమంత్ రెడ్డి ఉపాధి హామీ కూలీలు y హుస్సేనీ, కొండయ్య, రమేష్ హనుమంత రెడ్డి, భీమయ్య రాము, మల్లికార్జున, గోవింద్ రెడ్డి, చిన్నన్న,రామాంజనేయ, పక్కిరయ్య తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
