News
పాండవగల్ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మ ని కొనసాగించాలి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మని కొనసాగించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి మేటిలు ఉపాధి కూలీలు ఆదోని ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న మాట్లాడుతూ గత 2006 సంవత్సరం నుండి ఇప్పటివరకు 18 సంవత్సరాలుగా పాండవగల్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మ పనుల్లో ఎలాంటి అవకతవకలు, అవినీతి, అక్రమాలు లేకుండా నీతి, నిజాయితీగా,మన, తన తారతమ్యం లేకుండా గ్రామంలో అందరికీ పనులు కల్పిస్తూ ఉందని అలాంటి ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించడం వల్ల గ్రామంలో పని నిలిచిపోయి ఉపాధి కూలీలకు నష్టం కలుగుతుందని ఆమెను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి టిడిపి, ఒకసారి వైసీపీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పాండవగల్ ఫీల్డ్ అసిస్టెంట్ ను ఎవరు తొలగించలేదని ప్రస్తుతం ఉపాధి అధికారులు అధికార పార్టీ ఒత్తిడి మేరకు తొలగించాలని చూడడం సరికాదని ఆయన అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి ఎంపీడీవో మరియు అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి ఏపీఓ అధికారులు కు గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, ఉపాధి మేటిలు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని వారికి అందజేశం అని అన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఈ సమస్యను మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు, రామాంజనేయులు, సిఐటియు నాయకులు పాండురంగ, ఉపాధి హామీ మేటీలు కే హుస్సేని, అనంత ఆంజనేయ, హనుమంత్ రెడ్డి ఉపాధి హామీ కూలీలు y హుస్సేనీ, కొండయ్య, రమేష్ హనుమంత రెడ్డి, భీమయ్య రాము, మల్లికార్జున, గోవింద్ రెడ్డి, చిన్నన్న,రామాంజనేయ, పక్కిరయ్య తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




