News
తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే అవకాశం.. దిగువకు నీరు.. 3 గంటల బులిటన్..

కర్ణాటక: తుంగభద్ర: 21.07.2024 మధ్యాహ్నం 3.00 గంటలకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం. తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీటి నిలువ ప్రస్తుతం : 77.377 టీ.ఎం.సీ లు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 124129 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 3213 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.27 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీ.ఎం.సీ లు
ప్రస్తుతం : 77.377 టీ.ఎం.సీ లు
కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన సమాచారం మేరకు
ఎగువన వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. ప్రతిరోజు సుమారుగా 1 లక్ష 24 వేల 129 క్యూసెక్కుల నీరు డ్యామ్ కు చేరుతుంది. పైనుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర రిజర్వాయర్లోకి ఇన్ఫ్లోలు పెరిగే అవకాశం ఉన్నందున మిగులు నీటిని తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే నదిలోకి వదిలే అవకాశం ఉంది. తుంగభద్ర నది కి ఆనుకుని ఉన్న దిగువ గ్రామాలలోని సంబంధిత అధికారులు మరియు ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని మరియు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇన్ ఫ్లో ప్రస్తుతం 124129 క్యూసెక్కులు ఉంది
ఔట్ ఫ్లో : 3213 క్యూసెక్కులు, పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు, ప్రస్తుతం నీటిమట్టం 1625.27 అడుగులకు చేయింది.
డ్యామ్లో పూర్తిస్థాయి నీటి నిల్వ 105.788 టీ.ఎం.సీ లు ఉండగా ప్రస్తుతం 77.377 టీఎంసీలకుచేరుకుంది.
News
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం గవి గట్టు గ్రామంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో నీలకంఠ, బంగారయ్య ఇద్దరికీ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నీలకంఠ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పొలం విషయంలో పక్కన పొలంలో ఉన్న ఐదు మంది వ్యక్తులు ఇద్దరు మహిళలతో కలిసి వారిపై దాడి చేశారని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్

కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు కేరాఫ్ గా నిలిచాడని టిడిపి ఎ పి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,గుంతకల్లు మైనారిటీ పరిశీలకుడు గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో బుదవారం గడ్డా ఫక్రుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ, ఇవ్వని హామీలను అమలు చేస్తూ ప్రజల చేత మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటింటా సుపరిపాలన పేరిట గడప గడప కు తిరిగి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. మంత్రి వర్గంలో తీసుకున్న 9 అంశాలలో బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ వాయువు పీల్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అమలు,సత్ప్రవర్తన కలిగి ఉండడంతో 17 మంది జీవిత ఖైదీలకు విముక్తి, రాష్ట్ర వ్యాప్తంగా 2048 ఎస్పీఎఫ్ పోలీసు లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి, ఆటో డ్రైవర్ల తో సమావేశం ఏర్పాటు లాంటి సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకున్న పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
News
కాలేజ్ ప్రాంగణంలో నెట్వర్క్ టవర్ను తొలగించాలి విద్యార్థి సంఘాల డిమాండ్

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెట్వర్క్ టవర్ను వెంటనే తొలగించాలి DSF, PDSO, RPSF విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ RPSF జిల్లా అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.
కాలేజ్ మైదానంలో టవర్ ఉండటం వల్ల విద్యా వాతావరణం ప్రభావితం అవుతోందని వారు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ చొరవ చూపి వెంటనే స్పందించి తక్షణమే టవర్ను తొలగించాలని కోరారు. టవర్ ను తొలగించ లేకపోతే విద్యార్థులు అందరినీ సమీకరించి రానున్న రోజుల్లో బందుకు పిలుపునిస్తామని విద్యార్థి సంఘాలుగా ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు షకీల్ వినీల్ రాజ్ కుమార్ నవీన్ వినోద్ మురళి తదితరులు పాల్గొనడం జరిగింది

-
News4 weeks ago
స్కూల్ కాలేజీల దగ్గర గుట్కాలు, సిగరెట్లు అమ్మితే చర్యలు
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 09-07-2025
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-07-2025
-
News3 days ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News4 weeks ago
కోట శ్రీనివాసరావు కన్నుమూత
-
News10 hours ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News4 weeks ago
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర